బాత్రూం ఘటనపై అనురాగ్ ఠాకూర్ సీరియస్

by Disha Web Desk 2 |
బాత్రూం ఘటనపై అనురాగ్ ఠాకూర్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలోని సహ‌రాన్‌పూర్‌లోని ఓ స్టేడియంలో క‌బ‌డ్డీ క్రీడాకారులకు బాత్రూంలో భోజనాలు వడ్డించన ఘటనపై ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సీరియస్ అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయన స్పందించారు. కాంట్రాక్టర్, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. ఇప్పటికే జిల్లా క్రీడా అధికారి అనిమేశ్ స‌క్సేనాపై రాష్ట్ర ప్రభుత్వం స‌స్పెన్షన్ వేటు వేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది.



Next Story

Most Viewed