ఆసిస్ చేతిలో భారత్‌కు మరో ఓటమి

by Disha Web Desk 4 |
ఆసిస్ చేతిలో భారత్‌కు మరో ఓటమి
X

అడిలైడ్ : ఆస్ట్రేలియా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో ఆసిస్ చేతిలో ఓడిపోయింది. ఆరంభంలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ ఆఖర్లో తేలిపోవడంతో మ్యాచ్ చేజారింది. టాటుమ్ స్టీవర్ట్ 11వ నిమిషంలో గోల్ చేయడంతో మ్యాచ్‌లో ఆసిస్ శుభారంభం చేసినా.. స్వల్ప వ్యవధిలోనే సంగీత(12), గుర్జిత్ కౌర్(16) గోల్స్‌ సాధించడంతో ఫస్టాఫ్‌లో భారత్ 2-1 తేడాతో లీడ్‌లో నిలిచి పట్టు సాధించింది. అయితే, మూడో క్వార్టర్‌లో ఆస్ట్రేలియా టీమ్ ఇండియా డిఫెన్స్‌ను ఛేదించింది. మోర్గాన్ పిప్పా(37వ నిమిషం), టాటుమ్ స్టీవర్ట్(44వ నిమిషం) గోల్స్ అందించడంతో ఆతిథ్య జట్టు 3-2తో ఆధిపత్యంలోకి వెళ్లింది. చివరి క్వార్టర్‌లో భారత్ స్కోరును సమం చేసేందుకు చూసినా ఆసిస్ అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌తో భారత సీనియర్ డిఫెండర్ డీప్ గ్రేస్ ఎక్కా 250వ మ్యాచ్‌లను పూర్తి చేసి అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్ నేడు జరగనుంది.


Next Story