బీసీసీఐ నుంచి ప్రపంచ కప్ 'గోల్డెన్ టికెట్' అందుకున్న అమితాబ్ బచ్చన్

by Disha Web Desk 1 |
బీసీసీఐ నుంచి ప్రపంచ కప్ గోల్డెన్ టికెట్ అందుకున్న అమితాబ్ బచ్చన్
X

దిశ, వెబ్ డెస్క్ : వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న ఐసీసీ ప్రపంచకప్‌ కోసం బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు కార్యదర్శి జే షా మంగళవారం ప్రత్యేక గోల్డెన్‌ టికెట్‌ను అందజేశారు. ఈ మేరకు బీసీసీఐ తమ X (ట్విట్టర్)లో 'సూపర్ స్టార్ ఆఫ్ ది మిలీనియం.. అమితాబ్ గారికి బీసీసీఐ తరపున గోల్డెన్ టిక్కెట్‌ను అందించడం విశేషం. ఒక లెజెండరీ, క్రికెట్ ఔత్సాహికుడు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ట్వీట్ చేసింది. 12 ఏళ్ల తరువాత ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడనుంది.



Next Story

Most Viewed