ఫుట్‌బాల్ మైదానంలో బొమ్మల వర్షం

by Disha Web Desk 12 |
ఫుట్‌బాల్ మైదానంలో బొమ్మల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో బొమ్మల వర్షం కురిసింది. ప్లేయర్లు మ్యాచ్ అపిన కొద్దిసేపటికే బొమ్మలతో గ్రౌండ్ పూర్తిగా నిండిపోయింది. వివరాల్లోకి వెళితే.. టర్కిష్ ఫుట్‌బాల్ క్లబ్ బెసిక్టాస్ మద్దతుదారులు భూకంపాల వల్ల ప్రభావితమైన పిల్లలకు విరాళం ఇవ్వడానికి ఓ మ్యాచ్ నిర్వహించారు. ఈ క్రమంలో అంటాల్యాస్పోర్‌తో జరిగిన మ్యాచ్‌లో పిచ్‌పై వేలకొద్దీ మృదువైన బొమ్మలను మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు విసిరారు.

మ్యాచ్ ప్రారంభం అయిన 4 నిమిషాల 17 సెకన్ల తర్వాత మ్యాచ్ ను పాజ్ చేశారు. తీరా అభిమానులు విసిరిన బొమ్మలను చూస్తే గ్రౌండ్ మొత్తం నిండి ఉన్నాయి. దీనికి సంబంధించిన పొటోలను వారు ఆన్ లైన్ లో పెట్టారు. కాగా ఈ నెల 6న సంభవించిన భారీ భూకంపంలో టర్కీ, సిరియాలో కలిపి 50 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పొయారు.



Next Story

Most Viewed