పెళ్లి బరాత్‌లోకి దూసుకొచ్చిన లారీ.. సర్పంచ్‌తోపాటు మరో ఇద్దరు మృతి

by  |
bharath-acci1
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి బరాత్ చేస్తున్నవారిపై లారీ దూసుకెళ్లడంతో వరుడి తండ్రితోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మల్కన్ గిరి పందిరిపాణిలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుక అనంతరం బరాత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులందరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఓ లారీ సడెన్ గా వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో పెళ్లి కొడుకు తండ్రి, పందిరిపాణి సర్పంచ్ సిబా రాం ఖేముడు, సంతోష్ కుమార్, శుభాష్ లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మల్కన్ గిరి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

Next Story