192 దేశాలకు విస్తరించిన ‘దిశ’ దిన పత్రిక.. విశ్వసనీయతలో సాటిలేని డైనమిజం

by Bhoopathi Nagaiah |

‘దిశ డైలీ’(Disha Daily) తెలుగు భాషలో ప్రజలకు వార్తలు అందించే మీడియా సంస్థ.

192 దేశాలకు విస్తరించిన ‘దిశ’ దిన పత్రిక.. విశ్వసనీయతలో సాటిలేని డైనమిజం
X

పార్టీకో పత్రిక, సామాజిక వర్గానికో చానల్ అన్నట్టుగా తయారైంది తెలుగు రాష్ట్రాల మీడియా పరిస్థితి. ఒకే వాస్తవం.. ఒకే పరిణామం.. ఒకే వార్త.. ఒక్కో పేపర్‌లో, ఒక్కో చానల్‌లో ఒక్కోరకంగా వస్తుంది. దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో తేల్చుకోలేక జనం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారానికి విశ్వసనీయత ఉండదు. వాస్తవాలూ ఉంటాయి. పుక్కిటి పురాణాలూ ఉంటాయి. సమాచారమూ ఉంటుంది. సోదీ ఉంటుంది. అభిప్రాయాలూ ఉంటాయి. విద్వేషపు రాతలూ ఉంటాయి. సోషల్ మీడియాకు దీటుగా అన్ని రకాల వార్తలను, సమాచారాన్ని దినపత్రికల, చానళ్ల విశ్వసనీయతతో ఎప్పటికప్పుడు తాజాగా అందించడం ‘దిశ’ (Disha) ప్రత్యేకత.

‘దిశ డైలీ’(Disha Daily) తెలుగు భాషలో ప్రజలకు వార్తలు అందించే మీడియా సంస్థ. నిష్పాక్షిక వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు, అభిప్రాయాలను దిన పత్రిక రూపంలో (ప్రతి రోజూ ఒక ఉదయం ఎడిషన్, రెండు డైనమిక్ ఎడిషన్లు, ఒక స్పెషల్ ఎడిషన్), వెబ్‌సైట్ రూపంలో, అలాగే యూట్యూబ్ చానల్ ద్వారా అందిస్తుంది.

మార్చి 7, 2020న దిశ మీడియా, దిశ పేపర్, దిశ వెబ్‌సైట్, దిశ టీవీ ప్రారంభమయ్యాయి. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వంటి మెయిన్ స్ట్రీమ్‌ దినపత్రికలలో సుదీర్ఘకాలం కీలకస్థానాల్లో పని చేసిన దూడం మార్కండేయ దిశకు ఎడిటర్‌గా ఉన్నారు. పలువురు యంగ్, టాలెంటెడ్, క్రియేటివ్ జర్నలిస్టులు వివిధ విభాగాలకు నేతృత్వం వహిస్తున్నారు.

దిశ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ తూము మోహన్‌రావు వైద్యరంగంలో సుదీర్ఘ అనుభవమున్న డైనమిక్ బిజినెస్‌మ్యాన్. ‘మన తెలంగాణ’ దినపత్రిక ఎండీగా ఆయన గతంలో అందరికీ సుపరిచితుడు. ప్రస్తుతం ప్రశాంతి మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించి సారథ్యం వహిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో మండల స్థాయి వరకు విస్తరించిన బలమైన, అంకితమైన రిపోర్టింగ్ బ్యూరో మరియు జిల్లా నెట్‌వర్క్‌ దిశకు ఉంది. సంఘటనలు జరిగిన వెనువెంటనే ఖచ్చితమైన గ్రౌండ్ సమాచారాన్ని తక్షణం ఈ నెట్‌వర్క్ పంపిస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో, భారతదేశం అంతటా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 192 దేశాలలో నివసించే తెలుగు ప్రజలలో దిశ మీడియా విస్తరించి వుంది. దిశ యూనిక్ యూజర్ బేస్ సుమారు 12 కోట్లు కాగా, నెలవారీ సందర్శనలు 30-35 మిలియన్లు. నెలవారీ వీక్షణలు 45-50 మిలియన్లు. డైలీ హంట్ వంటి వార్తా వేదికలలో సైతం దిశకు బలమైన ఉనికి ఉంది.

మధ్యాహ్నం 1 గంటకు.. సాయంత్రం 5 గంటలకు.. అలాగే ముఖ్యవార్తలు బ్రేక్ అయినప్పుడు తక్షణం.. డైనమిక్ ఎడిషన్లను ప్రచురించడం ద్వారా తెలుగు మీడియాలో దిశ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

దిశ మెయిన్ ఎడిషన్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) 14–16 పేజీలతో వస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి సహా తెలంగాణ ఉమ్మడి జిల్లాలన్నింటికీ 4–8 పేజీలతో దిశకు టాబ్లాయిడ్‌స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలలోనూ 12 పేజీలతో ప్రింట్ ఎడిషన్ ఉంది.

Next Story