ఆస్తి పన్నుల కోసం ప్రత్యేక కార్యక్రమం: లోకేశ్ కుమార్

by  |
ఆస్తి పన్నుల కోసం ప్రత్యేక కార్యక్రమం: లోకేశ్ కుమార్
X

దిశ,వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను, కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రతీ ఆదివారం అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 24 నుంచి మార్చి 28 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రతీ ఆదివారం ఉ. 9. 30 గంటల నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశాలకు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు హాజరవుతారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆస్తిపన్ను కింద రూ.1247.27 కోట్లు వసూలు చేశామని చెప్పారు.

Next Story

Most Viewed