- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telangana Assembly Election 2023
- 2023 Cricket World Cup

దిశ, వెబ్ డెస్క్: రానున్న వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను సమర్ధవంతంగా వినియోగించుకునేలా పకడ్బందీ ప్రణాళికను రూపొందించేందుకు సీఎం అధ్యక్షతన నేడు ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. గోదావరిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఎప్పుడు ఎంత నీటిని విడుదల చేయాలి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, లోయర్ మానేరు డ్యామ్ తదితరాలకు నీటిని ఎప్పుడు తరలించాలి, మిగిలిన రిజర్వాయర్లకు ఎప్పుడు వదలాలి, ఆ నీటిని ఎలా వాడుకోవాలి తదితర అనేక అంశాలను ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు. మంత్రులు ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. పలు ప్రాజెక్టుల ఇంజనీర్లు కూడా ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నారు. ఈ సమావేశంలో స్పష్టత వచ్చిన తర్వాత కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో అనుసరించే విధానంపైనా సీఎం మరో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.