గోదావరిపై సీఎం అధ్యక్షతన నేడు ప్రత్యేక సమావేశం

by  |
గోదావరిపై సీఎం అధ్యక్షతన నేడు ప్రత్యేక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: రానున్న వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను సమర్ధవంతంగా వినియోగించుకునేలా పకడ్బందీ ప్రణాళికను రూపొందించేందుకు సీఎం అధ్యక్షతన నేడు ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. గోదావరిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఎప్పుడు ఎంత నీటిని విడుదల చేయాలి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, లోయర్ మానేరు డ్యామ్ తదితరాలకు నీటిని ఎప్పుడు తరలించాలి, మిగిలిన రిజర్వాయర్లకు ఎప్పుడు వదలాలి, ఆ నీటిని ఎలా వాడుకోవాలి తదితర అనేక అంశాలను ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. పలు ప్రాజెక్టుల ఇంజనీర్లు కూడా ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నారు. ఈ సమావేశంలో స్పష్టత వచ్చిన తర్వాత కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో అనుసరించే విధానంపైనా సీఎం మరో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.



Next Story

Most Viewed