కొవిడ్ మృతదేహాలకు కొత్త యంత్రం.. అరగంటకు ఒక దహనం

by  |
కొవిడ్ మృతదేహాలకు కొత్త యంత్రం.. అరగంటకు ఒక దహనం
X

దిశ, ఆదిలాబాద్: కొవిడ్ మృతదేహాల అంత్యక్రియల కోసం మున్సిపల్శాఖ ప్రత్యేక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రూరల్ మండలంలోని మావల శివారులోగల స్మశానవాటికలో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్ వైరస్‌తో మృతి చెందిన మృతదేహాలకు అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా వాళ్లు కూడా అంత్యక్రియలకు ముందుకు రావడం లేదు. ఓ పక్క గ్రామాల్లోకి రానివ్వకపోవడం.. మరోపక్క దహనసంస్కారాలకు కట్టెలు కొరత ఏర్పడింది. దీంతో మున్సిపల్ శాఖ పట్టణ ప్రణాళిక నిధులతో 12 లక్షల రూపాయలను వెచ్చించి ప్రత్యేక యంత్రాన్ని కొనుగోలు చేసింది. రూరల్ మండలంలోని మావల శివారులో గల కొవిడ్ స్మశానవాటికలో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎల్పీజీ గ్యాస్ తో పనిచేసే ఈ యంత్రం అరగంటకు ఒక మృతదేహాన్ని దహనం చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటికే పనులు పూర్తి కాగా.. ఇటీవల మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ యంత్రాన్ని పరిశీలించారు. త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed