రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి !

by  |
రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి !
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. ఖైరతాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్‌లో మంగళవారం పోలీసు అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించి సీపీ మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి వివాదాలు, అల్లర్లు లేకుండా శాంతియుతంగా జరిగేలా చూడటమే మనందరి లక్ష్యమన్నారు. రౌడీషీటర్లు భయానక వాతావరణం సృష్టించే అవకాశం ఉన్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్దనున్న ఆయుధాల సమర్పించే విషయంలో నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహారించాలన్నారు.



Next Story

Most Viewed