ఈ-పాస్‌లపై స్పెషల్ ఫోకస్ : సీపీ మహేష్ భగవత్

by  |
ఈ-పాస్‌లపై స్పెషల్ ఫోకస్ : సీపీ మహేష్ భగవత్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ఉల్లంఘనపై 41,990, మాస్క్ ధరించని వారిపై 11,638, పబ్లిక్ గ్యాదరింగ్‌పై 601, సోషల్ డిస్టెన్స్‌పై 1,832 కేసులు నమోదు చేసినట్టు సీపీ తెలిపారు. సిల్లీ కారణాలతో ఆన్‌లైన్ ఈ-పాస్‌లు అప్లై చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వేడుకలపై ఏసీపీ స్థాయి అధికారితో పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు. రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.



Next Story

Most Viewed