ప్రత్యేక విమానాల్లో అమెరికాకు 165 మంది

by  |
ప్రత్యేక విమానాల్లో అమెరికాకు 165 మంది
X

దిశ, న్యూస్‌బ్యూరో: వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి లాక్‌డౌన్ వల్ల ఇక్కడే చిక్కుకుపోయిన 165మంది అమెరికన్‌లు సొంత దేశానికి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు ఎయిర్ ఇండియా విమానాల్లో వీరిని సొంత దేశానికి పంపించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీరందరినీ ఎయిర్ పోర్టుకు సురక్షితంగా చేర్చడంలో, థర్మల్ స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొదట ముంబై వెళ్లనున్న వీళ్లు తర్వాత అక్కడి నుంచి డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో అమెరికా చేరుకుంటారు. లాక్‌డౌన్ స్టార్టైనప్పటి నుంచి నగరంలో చిక్కుకుపోయిన పలు దేశాల పౌరులను ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి అక్కడికి పంపించడం ఇది ఏడవసారి.

tags :telangana, gmr airport, americans, evacuation, special flights

Next Story