దీక్షిత్ ముక్కు కోసి, గొంతు నులిమి హత్య :ఎస్పీ

by  |
దీక్షిత్ ముక్కు కోసి, గొంతు నులిమి హత్య :ఎస్పీ
X

దిశ, వెబ్‎డెస్క్: దీక్షిత్ ముక్కు కోసి, గొంతు నులిమి సాగర్ హత్య చేశాడని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. మహబూబాబాద్ దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు సాగర్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు దీక్షిత్‎ను కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే హత్య చేశాడని తెలిపారు. బాలుడిని బైకుపై ఎక్కించుకుని వెళ్లి.. ఆర్ఎంపీ డాక్టర్ వద్ద తీసుకొచ్చిన మత్తు ట్యాబెట్లను నీటిలో కలిపి తాగించాడు. అ తర్వాత ముక్కు కోసం గొంతు నులిమి చంపేశాడన్నారు. అనంతరం ఇంటికొచ్చి స్నానం చేసి దీక్షిత్ డెడ్‎బాడీ దగ్గరకు వెళ్లాడు. రాత్రి 10 గంటలకు పెట్రోల్ పోసి తగులబెట్టాడని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

హత్య చేసిన తర్వాత సాగర్ డింగ్ టోన్ యాప్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. తనను పోలీసులు ఫాలో అవుతున్నారని అనుమానంతో రంజిత్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడు ఏడాది నుంచి డింగ్ టోన్ యాప్ వాడుతున్నాడని.. ఇంటర్నెట్ కాల్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ హత్య కేసులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed