- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్: అనుమానం పెనుభూతమైంది ఆ కొడుకులకు… తల్లికి కరోనా సోకిందని ఇంటినుంచి వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచక ఇంటి ముందు కూర్చొని దీనంగా చూస్తోన్నది కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన కట్ట శ్యామల. విషయమేమిటంటే.. బంధువులను చూసేందుకని మహారాష్ట్ర షోలాపూర్ కు శ్యామల వెళ్లింది. లాక్ డౌన్ కు ముందు వెళ్లిన శ్యామల వెంటనే కరీంనగర్ రాలేకపోయింది. సడలింపులు ఇవ్వడంతో కరీంనగర్ వచ్చిన శ్యామలను ఇంట్లోకి రానివ్వడం లేదు. మహారాష్ట్రలో కరోనా విజృంభించడంతో అక్కడి నుండే వచ్చిన తల్లికి కరోనా సోకిందన్న అనుమానంతో ఇంట్లోకి రావొద్దని చెప్తున్నారు కొడుకులు. దీంతో తల్లి ఇంటిముందు కూర్చుంది. చెట్టంత ఎదిగిన ముగ్గురు కొడుకులు ఇంటికి రానివ్వకపోవడంతో ఎక్కడికెల్లాలో దిక్కు తోచక దిక్కులు చూస్తోన్నది. షోలాపూర్ నుంచి వచ్చేటప్పుడే అక్కడి వైద్యులు కరోనా టెస్ట్ లు చేస్తే నెగెటివ్ వచ్చిందని చెప్తున్నా కొడుకులు మాత్రం వినడం లేదు. దీంతో స్థానికులు జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి వరకు రోడ్డుపై ఉన్న శ్యామలను స్థానిక కార్పోరేటర్ ఎడ్ల సరిత తన ఇంటికి తీసుకెళ్లారు.