ఈ నెల 20 విపక్ష పార్టీల నేతలతో సోనియా భేటీ

by  |
ఈ నెల 20 విపక్ష పార్టీల నేతలతో సోనియా భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 20న విపక్ష పార్టీ నేతలతో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక భేటీ నిర్వహించనున్నారు. వర్చువల్‌గా నిర్వహించనున్న ఈ భేటీలో 3 రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. తమిళనాడు సీఎంతో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ సీఎంలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వరుసగా విపక్ష నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది.

Next Story