సోనాక్షి సొంతింటి కల నిజమైన వేళ..

by  |
సోనాక్షి సొంతింటి కల నిజమైన వేళ..
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ సెలెబ్రిటీలు రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ మధ్య హృతిక్ రోషన్, జాన్వీ కపూర్ ముంబైలోని జూహు‌లో ప్రాపర్టీస్ కొనుగోలు చేయగా..ఆలియా భట్ బాంద్రా‌లో ఇల్లు కొనేసింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ముంబైలో ఓ అపార్ట్ మెంట్ తీసుకుని..లాస్ట్ మంత్ అక్కడికి షిఫ్ట్ అయింది. ఈ క్రమంలో ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. బాంద్రాలో కొత్తగా 4 BHK ఇల్లు కొనింది. ఈ విషయాన్ని తెలుపుతూ సంతోషపడిపోయిన సోనాక్షి..థర్టీ‌లోకి ఎంటర్ కాకముందే తన సంపాదనతో సొంత ఇల్లు కొనుగోలు చేయాలనేది కల అని.. కాస్త లేట్ అయినా సరే డ్రీమ్ ఫుల్ ఫిల్ కావడంతో హ్యాపీగా ఉన్నానని తెలిపింది.

ప్రస్తుతం జూహూలోని బంగ్లాలో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న భామ..ఇప్పుడే కొత్త ఇంట్లోకి వెళ్లే ఆలోచన లేదని, ఫ్యామిలీతో స్పెండ్ చేయడమే ఆనందంగా ఉంటుందని చెప్పింది. పెయింటింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న సోనాక్షి.. ఇందుకోసం న్యూ హౌజ్‌లో స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసుకుందట. వెండితెరపై చివరిగా సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’లో కనిపించిన సోనాక్షి..‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ మూవీలో అజయ్ దేవగన్, సంజయ్ దత్‌తో కలిసి త్వరలో టాకీసుల్లో సందడి చేయనుంది.


Next Story

Most Viewed