తల్లిని చంపిన కొడుకు.. వాటి కోసమేనా ?

by  |
తల్లిని చంపిన కొడుకు.. వాటి కోసమేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మానవత్వం అనేది మంటగలుస్తుంది. నవమాసాలు మోసిన కన్నతల్లినే కొడుకు హత్యచేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. తల్లి పింఛన్ డబ్బుల కోసం కన్న కొడుకు ఏకంగా తల్లినే హత్య చేశాడు. ఈ ఘటన పరిగి మండలం ఖుదావాన్‌పూర్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. అయితే తల్లి ఎంత అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహానికిలోనైన కొడుకు తల్లి భీమమ్మ గొంతును విద్యుత్ తీగతో నులిమి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed