కోడలి మాయలో మామ.. ఏకంగా కొడుకునే..

by  |
mama-and-kodal
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ తండ్రి కోడలి మాయలో పడి కన్న కొడుకునే హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా సంతమాగులూరులో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఏల్పూరు ఎస్సీ కాలనీలో లక్ష్మయ్య, సునీత దంపతులు నివాసముంటున్నారు. వీరితో పాటే లక్ష్మయ్య తండ్రి కూడా అదే ఇంట్లో ఉంటున్నట్టు సమాచారం. కొడుకు ఇటీవల మద్యానికి బానిసయ్యాడు.

అయితే, కొడుక్కి నచ్చజెప్పి దంపతులను కలపాల్సిన తండ్రి కరుణయ్య వక్రబుద్ధి ప్రదర్శించాడు. ఏకంగా కోడలి మాయలో పడి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో ఏకంగా ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మయ్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు తండ్రి, భార్యే నిందితులుగా తేల్చారు. అనంతరం కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed