తండ్రికి విషం తాగించి.. కొడుకు సూసైడ్

by  |
తండ్రికి విషం తాగించి.. కొడుకు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ పంజాగుట్టలో విషాదం చోటు చేసుకుంది. విషం తాగి తండ్రీకొడుకు ఆత్మహత్యకు యత్నించగా.. కొడుకు మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఓ ఐటీ కంపెనీలో తండ్రీకొడుకు క్యాంటీన్ నిర్వహిస్తుండగా లాక్‌డౌన్‌తో తీవ్రనష్టాలు వచ్చాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్థాపానికి గురై కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇదేక్రమంలో కరోనా మందు అని చెప్పి తండ్రికి విషం తాగించిన కొడుకు.. తాను కూడా తాగి ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed