బాలు మృతిపై కుమారుడు చరణ్ ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-25 04:50:24  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసినట్లు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ మీడియాకు వెల్లడించారు. ప్రేక్షకులందరికీ నమస్కారం నాన్న ఇవాళ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు కన్నుమూశారు. నాన్న కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అశేష అభిమానులు, సేవలందించిన డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రి సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు నాన్న తమతో ఉంటారని, నాన్న పాటలు గుర్తుండి పోతాయని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం తిరువళ్లూరు జిల్లాలో ఎస్పీ [&hellip;]</p>

బాలు మృతిపై కుమారుడు చరణ్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసినట్లు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ మీడియాకు వెల్లడించారు. ప్రేక్షకులందరికీ నమస్కారం నాన్న ఇవాళ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు కన్నుమూశారు. నాన్న కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అశేష అభిమానులు, సేవలందించిన డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రి సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు నాన్న తమతో ఉంటారని, నాన్న పాటలు గుర్తుండి పోతాయని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం తిరువళ్లూరు జిల్లాలో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరగనున్నాయి.

Read also…

అన్ని తరాల మ్యూజిక్ డైరక్టర్లతో..

Next Story