మానవత్వం మరిచిన కొడుకు, కూతురు.. అమానుషంగా తండ్రిని రోడ్డుపై..

by  |
మానవత్వం మరిచిన కొడుకు, కూతురు.. అమానుషంగా తండ్రిని రోడ్డుపై..
X

దిశ, గోదావరిఖని : మానవత్వం మరిచిన కుటుంబ సభ్యులు తండ్రిని ఇంటి నుండి గెంటి వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. శేషాల ఓదేలు అర్జీ-1 పరిధిలోని ఒకటవ గనిలో ట్రామర్‌గా పని చేసి ఐదు సంవత్సరాల కిందట తన ఉద్యోగాన్ని డిపెండెంట్ ద్వారా కుమారుడికి ఇచ్చాడు. అప్పటి నుండి గోదావరిఖనిలోని తిలక్ నగర్‌లో కూతుళ్లతో కలిసి నివసిస్తున్నారు.

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా తన ఆరోగ్యం సహకరించకపోవడం పక్షవాతం రావడంతో అనారోగ్య కారణాలు ఎదుర్కొంటున్నాడు. దీంతో కొడుకు, కూతుళ్లు కలిసి ఓదెలును ఇంటి నుంచి గెంటి వేయడంతో కాలనీవాసులు చేరదీసి ఆదరిస్తున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సింగరేణిలో పనిచేసి తన ఉద్యోగాన్ని కుమారుడికి ఇప్పించినా కనికరం చూపకపోవడంపై కుటుంబ సభ్యుల తీరుపై పలువురు మండిపడుతున్నారు.



Next Story

Most Viewed