ఢిల్లీకి సోము వీర్రాజు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై అమిత్ షాతో భేటీ

by  |
ఢిల్లీకి సోము వీర్రాజు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై అమిత్ షాతో భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సోమవారం ఢిల్లీకి పయనం కానున్నారు. బీజేపీ అగ్రనేతలు కలిసేందుకు ఆయన వెళ్తున్నట్లు సమాచారం. రెండ్రోజుల హస్తిన పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల సంయుక్త పోటీ, తాజా రాజకీయాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అగ్రనేతలతో చర్చించనున్నారు. ముఖ్యంగా వైజాగ్ స్టీలు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే వచ్చే దుష్పరిణామాలను అమిత్ షాకు వివరించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, స్టీలు ప్లాంటును కారుచౌకగా అమ్మడానికి వీళ్లేదని చెప్పనున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఆటవిక పాలన సాగుతోందన్నారు.

Next Story