బాబు అక్రమాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు..?

by  |
బాబు అక్రమాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు..?
X

దిశ, వెబ్‎డెస్క్:
చంద్రబాబు అక్రమాలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పోలవరంలో అవకతవకలు జరిగాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు.

కేంద్రం నుంచి 7 లక్షల ఇళ్లు వస్తే.. చంద్రబాబు 60 వేల టిడ్కో ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని భూములు కొన్నారని.. వీటిలో అవినీతి జరిగిందని అన్నారు. టీటీడీ బడ్జెట్ ఏడాదికి 1,200 కోట్లు కేటాయిస్తోంది.. వాటిలో హిందుత్వం కోసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed