అప్పుల్లో వైసీపీ ప్రభుత్వం ముందుంది: సోము వీర్రాజు

by  |
అప్పుల్లో వైసీపీ ప్రభుత్వం ముందుంది: సోము వీర్రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పుల్లో వైసీపీ ప్రభుత్వం ముందుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొనుగోలులో అవినీతి జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు చేసిన అవినీతిని వైసీపీ బయటపెట్టలేకపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం తీరు చంద్రబాబును కాపాడే విధంగా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తే తామే ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు.

Next Story

Most Viewed