- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వికారాబాద్ : సంతకం సరే.. ఆ అధికారి వేలిముద్ర ఎలా ఫోర్జరీ జరిగిందంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తహశీల్దార్ రవీందర్ వేలిముద్రను ఫోర్జరీ చేసి అక్రమంగా భూ బదలాయింపు చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తహశీల్దార్ కార్యాలయంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ పరిధిలోని బుర్గుపల్లిలో సర్వే నెంబర్ 18లో గల 7:12 ఎకరాల భూమిని తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి యజమానికి తెలియకుండా మరొకరి పేరుమీద భూ బదలాయింపు చేశారు ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్లు, మరికొంత మంది.
సంతకాన్ని ఫోర్జరీ చేస్తారు కానీ, వేలిముద్రను ఎలా ఫోర్జరీ చేస్తారు అనేది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న. ఎమ్మార్వోకు తెలియకుండానే ఈ తతంగమంతా జరిగిందా..? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా తహశీల్దార్ ప్రమేయం లేకుండానే వేలిముద్ర ఫోర్జరీ ఎలా సాధ్యమవుతుందినే ప్రశ్నకు కొందరు రెవిన్యూ, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మరి దీనికి సదరు ఎమ్మార్వో ఏమి సమాధానమిస్తారో వేచిచూడాలి.