కరోనా టైమ్‌లో జీతాలు పెంచుతున్న కంపెనీలివే!

by  |
కరోనా టైమ్‌లో జీతాలు పెంచుతున్న కంపెనీలివే!
X

కొవిడ్-19 ధాటికి తట్టుకోలేక ఖర్చులు తగ్గించుకునే నెపంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. బుక్‌మైషో, ఉబెర్, ఓలా వంటి కంపెనీలు ఇప్పటికే వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్డున పడేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగాల నుంచి తీసేయడం పక్కన పెట్టి, వారికి 50 నుంచి 70 శాతం మేర జీతాల్లో పెంపును కూడా అందిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మింత్రా, క్యాప్ జెమిని, భారత్‌పే, హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కష్టకాలంలో కంపెనీ తమను ఆదుకుంటున్నదన్న నమ్మకాన్ని ఉద్యోగుల్లో కల్పించే ఉద్దేశంతోనే ఈ కంపెనీలన్నీ జీతాల పెంపు ప్రతిపాదనను అమలు చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.



Next Story

Most Viewed