ఆస్పత్రి సిబ్బందిని సస్పెండ్ చేయండి : సోమారపు సత్యనారాయణ

by  |
ఆస్పత్రి సిబ్బందిని సస్పెండ్ చేయండి : సోమారపు సత్యనారాయణ
X

దిశ, గోదావరిఖని : గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్లో శిశువుకు జన్మనిచ్చిన బాలింత ఉమ ఆత్మహ్యత చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్‌లో సిబ్బంది నిర్లక్ష్యానికి మృతి చెందిన విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్‌తో మాట్లాడారు. నిర్లక్ష్యం చేసిన సిబ్బందిపై దర్యాప్తు చేసి సస్పెండ్ చేయాలని, చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed