సైనికుడి కాల్పుల్లో 17 మంది మృతి

by  |
సైనికుడి కాల్పుల్లో 17 మంది మృతి
X

నిత్యం పర్యాటకులతో కళకళలాడే థాయ్‌లాండ్ నెత్తురోడింది. ఓ సైనికుడు తుపాకీని జనాలపైకి ఎక్కిపెడుతూ పిట్టలా కాల్చాడు. ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. ఖోరత్‌లో ఓ షాపింగ్ మాల్ వద్ద తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులు జరిపాడు. ఆ సైనికుడు బైక్‌పై తిరుగుతూ కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా, ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. అనేక మందికి గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన సైనికుడిని జక్రాఫాంత్ తోమాగా గుర్తించారు.



Next Story

Most Viewed