స్మార్ట్ స్పీకర్లకు భారీ డిమాండ్

by  |
స్మార్ట్ స్పీకర్లకు భారీ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా స్మార్ట్ టెక్నాలజీ పరికరాల వినియోగం ఇటీవల భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే దేశీయంగా స్మార్ట్ స్పీకర్ల రవాణా ఈ ఏడాది ముగిసే సమయానికి 7.5 లక్షల యూనిట్లు దాటే అవకాశాలున్నాయని టెక్ఆర్క్ సోమవారం విడుదల చేసిన తన నివేదికలో తెలిపింది. 2020, సెప్టెంబర్ త్రైమాసికంలో 91 శాతం వాటాతో అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్ ఈ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడు పోయింది. దీని తర్వాతి స్థానంలో జియోమీ 7 శాతం, గూగుల్ 2 శాతం వాటాను దక్కించుకున్నాయి.

స్మార్ట్ టెక్నాలజీ కోసం దేశీయంగా డిమాండ్ పెరిగింది. ఇందులో భాగంగానే వాయిస్-కంట్రోల్‌డ్ స్మార్ట్ స్పీకర్ వంటి పరికరాల విక్రయాలు పెరిగాయని టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కవూసా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే త్రైమాసికంలో స్మార్ట్ స్పీకర్ల ఎగుమతులు గత త్రైమాసికంతో పోలిస్తే 87 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది. రానున్న రోజుల్లో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని ఫైసల్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed