శ్రీలంక-ఇండియా మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు

by  |
Schedule
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక-ఇండియా మధ్య ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ సమయాల్లో మార్పులు చేసినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచే వన్డే సిరీస్ ప్రారంభం కావల్సి ఉండగా.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి వచ్చిన శ్రీలంక జట్టులో కరోనా కేసులు బయటపడటంతో వారు క్వారంటైన్‌కు వెళ్లారు. దీంతో బీసీసీఐని సంప్రదించి శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. మరోవైపు బ్రాడ్‌కాస్టర్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు వన్డే మ్యాచ్‌లు అరగంట, టీ20 మ్యాచ్‌లు గంట ఆలస్యంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు శ్రీలంక బోర్డు టైమింగ్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

వన్డే మ్యాచ్‌లు : 18 జులై, 20జులై, 23 జులై – అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి.

టీ20 మ్యాచ్‌లు : 25 జులై,27 జులై, 29 జులై – అన్ని మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.



Next Story

Most Viewed