అమెజాన్‌లో చోరీ, ఆరుగురు అరెస్ట్

by  |
అమెజాన్‌లో చోరీ, ఆరుగురు అరెస్ట్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌లోని అమెజాన్ కంపెనీలో రూ.4 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుత కరోనా నేథప్యంలో కంపెనీలో తనిఖీ పెద్దగా లేకపోవడంతో బొట్టు సాయి కుమార్ (సైదాబాద్), తక్కల్లపల్లి ప్రణవ్ కుమార్ (బోడుప్పల్), చంటి ఆనంద్ (నందిగామ), పడమటి మహేష్ (సరూర్ నగర్), చింటా కార్తీక్ (నాగర్ కర్నూల్), ఇమ్రాన్ (షాద్ నగర్) లు కంపెనీలోని సెల్ ఫోన్లు, బ్లూ టూత్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీకి పాల్పడ్డారు. కంపెనీ యాజమాన్యం స్థానిక ఎయిర్‌పోర్టు పోలీసులకు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు మిస్ అయినట్టు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారని తేలడంతో సోమవారం ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.



Next Story