- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చార్మినార్ : ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెల్లు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ జీఎం ఛావునీ బహార్ ఫంక్షన్ హాల్ సమీప ప్రాంతానికి చెందిన మున్నీబేగం, దివంగత షేకత్ఖాన్లు దంపతులు. వీరికి ఉజ్మా(15), షబనమ్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
అయితే.. ఈ నెల 10వ తేదీన ఉజ్మా, తన చిన్నమ్మ కూతురు నిషా(15)తో కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన మున్నీబేగం.. ఉజ్మా, నిషా అచూకీ కోసం చుట్టు పక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మున్నీబేగం.. చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మున్నీబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.