గాంధీలో ‘గ్యాంగ్ రేప్’.. అక్క ఎఫైర్‌ను దాచి కట్టుకథ అల్లిన చెల్లి..!

by  |
గాంధీలో ‘గ్యాంగ్ రేప్’.. అక్క ఎఫైర్‌ను దాచి కట్టుకథ అల్లిన చెల్లి..!
X

దిశ, వెబ్‌డెస్క్ : గాంధీ ఆస్పత్రిలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఒక్కసారిగా నగరవాసులు ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి అక్క కనిపించకుండా పోయేసరికి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రెండు కేసుల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. తీరా కనిపించకుండా పోయిన యువతి ఆచూకీ గురువారం లభించడంతో గ్యాంగ్ రేప్, మిస్సింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి.

అసలు గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు తేల్చారు. అక్క చేసిన పనిని కప్పిపుచ్చేందుకు చెల్లి గ్యాంగ్ రేప్ కట్టుకథ అల్లినట్టు నిర్దారించారు. అయితే, అక్కాచెల్లెల్లు ఇద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని విచారణలో తేలింది. ట్రీట్మెంట్ కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చిన అక్కాచెల్లెల్లు ఇద్దరు కల్లు సేవించగా.. అక్క గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందితో బయటకు వెళ్లింది. ఫుల్లుగా కల్లు తాగిన చెల్లెలు అపస్మారక స్థితిలో ఆస్పత్రిలోనే ఉండిపోయింది.

బంధువులు వచ్చి అడుగగా అక్క చేసిన పనిని కప్పిపుచ్చేందుకు తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని, అక్క కనిపించడం లేదని కట్టు కథ అల్లింది. ఇదే నిజమని నమ్మిన బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో మూడు రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉండగా, నగరంలోని సంతోష్ నగర్‌లో ఆటో డ్రైవర్లు తనను గ్యాంగ్ రేప్ చేశారని వచ్చిన ఫిర్యాదు కూడా వట్టిదే అని పోలీసులు తేల్చారు. ప్రియుడు తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి అతన్ని ఎలాగైనా కేసులో ఇరికించాలనే గ్యాంగ్ రేప్ నాటకం ఆడినట్టు తేలింది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన విషయాన్ని నగర సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

యువకుడిని మత్తులోకి దింపిన ఒకే అమ్మాయి.. మూడు గొంతులు, మూడు పాత్రలు!

Read more : ప్రభుత్వ వైద్యుడి పైశాచికత్వం.. బాతురూంలో నర్స్ నగ్న వీడియోలు తీసి.



Next Story

Most Viewed