- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,ఇల్లందు: సింగరేణి కార్మికుల సమస్యలను అడగడానికి వెళ్లిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సారయ్య పై సింగరేణి మేనేజర్ దాడిచేసిన ఘటన ఇల్లందులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. 21 ఇంక్లైన్ సింగరేణి మేనేజర్ ధనుంజయరెడ్డిని కలసి కార్మికుల సమస్యల గురించి చెప్తామని వెళ్లిన సారయ్యపై మేనేజర్ దాడి చేసి తన గది నుంచి బయటకు గెంటేశారు. విషయం తెలుసుకున్న సింగరేణి కార్మికులు, సీపీఐ పార్టీ కార్యకర్తలు, మేనేజర్ను ఆయన గదిలోనే పెట్టి తాళం వేశారు. అనంతరం ఇల్లందు ఏరియా సింగరేణి జీఎం మల్లెల సుబ్బారావుకు, సారయ్య, సింగరేణి కార్మికులు, ఏఐటీయూసీ నేతలు జరిగిన విషయాన్ని తెలియజేశారు. సారయ్య అభిమానులు, సీపీఐ కార్యకర్తలు, సింగరేణి కార్మికులు, ఏఐటీయూసీ నేతలు జీఎం కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారు.
Next Story