సివిల్స్ ర్యాంకర్‌కు సింగరేణి సీఎండీ సన్మానం

by  |
సివిల్స్ ర్యాంకర్‌కు సింగరేణి సీఎండీ సన్మానం
X

దిశ, న్యూస్‌బ్యూరో: సింగరేణి కార్మికుడైన సిరిశెట్టి సత్యనారాయణ కుమారుడు సంకీర్త్‌ సివిల్స్‌‌లో 330వ ర్యాంకు సాధించడం హర్షించదగిన విషయమని, సంకీర్త్‌ను ఆదర్శంగా తీసుకొని ఇతర సింగరేణి కార్మికుల పిల్లలు పట్టుదల, లక్ష్యంతో కృషిచేసి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌‌లో సోమవారం ఆయన సివిల్స్‌‌లో 330వ ర్యాంకు సాధించిన సంకీర్త్‌‌ను ఘనంగా సన్మానించారు. బెల్లంపల్లి ఏరియా ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో ఎలక్ట్రీషియన్‌‌గా పనిచేస్తున్న సంకీర్త్‌ తల్లిదండ్రులు సిరిశెట్టి సత్యనారాయణ, అనిత‌లను ఈ సంధర్భంగా ప్రత్యేకించి అభినందించారు.



Next Story

Most Viewed