బాబు ఇంటిపై దాడి.. టీటీడీపీ నేతలు నిరసన

by  |
బాబు ఇంటిపై దాడి.. టీటీడీపీ నేతలు నిరసన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ టీటీడీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు శనివారం ఎన్టీఆర్ భవన్​లో మౌన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడికి దిగడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో పొలిట్ బ్యురో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి ప్రోఫెసర్ జ్యోత్స్న, పార్టీ ఉపాధ్యక్షురాలు ప్రసూన, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గుడెపు రాఘవులు, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed