అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్

by  |
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్
X

దిశ, నిజామాబాద్: జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన ఇందల్‌వాయి మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది.గ్రామ సమీపంలోని వాగులో మంగళవారం ఉదయం మూడు ట్రాక్టర్లు, ఓ టిప్పర్‌లో ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు శ్రీను, గణేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, సంతోష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు.

Tags: sand, tractors, siege, idalvai, crime, nizamabad

Next Story