ఆ డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

by  |
ఆ డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్ధిపేటలో బీజేపీ నేతలు-పోలీసుల మధ్య వాగ్వాదం సంచలనం రేపుతోంది. ఇక ఇదే విషయం పై స్పందించిన కమిషనర్ జోయల్ డేవిస్ దొరికిన డబ్బు బీజేపీ నాయకులదే అని స్పష్టం చేశారు. రఘునందన్ బంధువుల ఇంట్లో రూ. 18 లక్షల 67 వేలు దొరికాయన్నారు. ఆయన బంధువు జితేందర్ రెడ్డి డ్రైవర్ ద్వారా డబ్బులు పంపారని సీపీ తెలిపారు. దుబ్బాక ఎన్నికల కోసమే పైసలు పంపినట్టు తేలిందని.. సోదాలకు సంబంధించిన పూర్తి వీడియోలను రికార్డు చేశామన్నారు. పోలీసుల నుంచి రూ. 5 లక్షల 87 వేలను దొంగిలించారని.. వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు. తమ పై దాడి చేసి మరీ డబ్బులను దొంగిలించారని సీపీ ఆరోపించారు.

Next Story

Most Viewed