వాటి వల్లే యువత చెడిపోతున్నారు : ఎస్సై విజయ్ కృష్ణ

by  |
వాటి వల్లే యువత చెడిపోతున్నారు : ఎస్సై విజయ్ కృష్ణ
X

దిశ,గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో దుకాణదారులకు గుట్కా గంజాయి పై అవగాహన సదస్సు నిర్వహించిన సబ్ ఇన్ స్పెక్టర్ విజయ్ కృష్ణ. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గుట్కా గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని వీటివల్ల యువత చెడిపోతుందని అన్నారు. యువకులు మంచి మార్గంలో ఉండాలని సూచించారు. అలాగే దుకాణాల్లో గుట్కా, గంజాయి విక్రయించడానికి వీలు లేదని అక్రమంగా ఎవరైనా విక్రయానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై విజయ్ కృష్ణ హెచ్చరించారు.

Next Story

Most Viewed