కరోనా మృతిపై హెచ్‌ఆర్సీ స్పందన

by  |
కరోనా మృతిపై హెచ్‌ఆర్సీ స్పందన
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా నల్లగొండ జిల్లాలో కరోనాతో వ్యక్తి మృతి ఘటనపై హెచ్‌‌ఆర్సీ సుమోటో‌గా కేసు నమోదు చేసింది. ఆగష్టు 21లోగా ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​ను ఆదేశించింది. నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో మాడుగులపల్లి గ్రామానికి చెందిన ఓ తల్లి కళ్లెదుటే తన కుమారుడు ఆక్సిజన్ అందక ఈ నెల 18న కరోనాతో మృతి చెందాడు. బాధితుడు ఆసుపత్రిలో ఉదయం చేరగా… సాయంత్రం వరకు ఒక్క వైద్యుడు కూడా రాకపోవటంతో బెడ్ మీదనే ప్రాణాలు కోల్పోవడంపై హెచ్ ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితునికి కరోనా పరీక్షలు ఎప్పుడు చేశారు.. పాజిటివ్​ అని నిర్ధారణ కాకుండానే కొవిడ్ వార్డులో ఎందుకు చేర్చారు? చేర్చుకున్నాక ఆక్సిజన్ ఎందుకు పెట్టలేదంటూ.. సూపరింటెండెంట్​పై హెచ్చార్సీ ప్రశ్నల వర్షం కురిపించింది. కొవిడ్ వార్డుకు ఇతరులు పోవడానికి ఆనుమతి లేనప్పుడు అతని తల్లిని ఎలా అనుమతించారు అని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించింది.


Next Story