టీడీపీ వాడిననే నన్ను వేధిస్తున్నారు

by  |
టీడీపీ వాడిననే నన్ను వేధిస్తున్నారు
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలం మామిళ్ల పల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా వేసుకున్న దుకాణాలను అధికారులు తొలగించారు. రోడ్డుకి ఇరువైపులా వేసుకున్న దుకాణాలు తొలగించేందుకు తెల్లవారుజామునే జేసీబీ యంత్రాలతో అధికారులు చేరుకున్నారు.

షాపులు తొలగిస్తుండడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు టీడీపీ కార్యకర్తనన్న కారణంతో వేధింపులకు పాల్పడుతున్నారని, తన కుటుంబాన్ని పోషించుకునేందుకున్న ఒక్క ఆధారాన్ని నాశనం చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దుకాణంతో పాటు అక్కడున్న ఆక్రమనలన్నింటినీ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed