టీఆర్ఎస్‌కు షాక్.. తొలి రౌండ్‌లో ఈటల ఆధిక్యం

by  |
BJP, Etela Rajender
X

దిశ, వెబ్‌డెస్క్‌: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపులో ఊహించని షాక్ తగిలింది. హుజురాబాద్ తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్‌కు 4444, బీజేపీకి 4610, కాంగ్రెస్‌కు 119 ఓట్లు పోల్ అయ్యాయి. తొలిరౌండ్‌లో మొత్తం 9173 ఓట్లు నమోదు అయ్యాయి.



Next Story

Most Viewed