టీఆర్ఎస్‌కు షాక్.. పదో రౌండ్‌లో కాంగ్రెస్ లీడ్

by  |
టీఆర్ఎస్‌కు షాక్.. పదో రౌండ్‌లో కాంగ్రెస్ లీడ్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియలో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. మొదటి 9 రౌండ్లలో ఆధిక్యం కనబర్చిన టీఆర్ఎస్, పదో రౌండ్ వచ్చేసరికి అనుహ్యంగా కాంగ్రెస్ లీడ్ సాధించింది. పదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2991 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 3166 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి 175 ఓట్ల లీడ్ వచ్చింది. మొత్తంగా పదిరౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 35,589 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ 27,653 ఓట్లు సాధించింది. ఓవరాల్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి 7936 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


Next Story

Most Viewed