జనసేనకు షాక్.. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

by  |
జనసేనకు షాక్.. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ తమ ప్రభావాన్ని చాటుకోవలన్న ఉత్సాహంతో దూసుకెళ్తుంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా ఇటీవల తిరుపతిలో కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగాలనే అంశాన్ని ఇరు పార్టీలతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని కొద్దిరోజుల క్రితం పవన్ ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం తిరుపతి రోడ్ షోలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలో మాట్లాడుతూ.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికి ప్రజలు ఓటు వేయాలని అన్నారు. దీంతో తిరుపతి అభ్యర్థి బీజేపీ నుంచే బరిలో ఉంటారనేది స్పష్టం అయింది. అయితే దీనిపై జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.



Next Story

Most Viewed