సాగర్ బై పోల్.. కాంగ్రెస్, బీజేపీ నేతలకు షాక్

by  |
సాగర్ బై పోల్.. కాంగ్రెస్, బీజేపీ నేతలకు షాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్​ ఉప ఎన్నికకు సంబంధించి తొలి ప్రక్రియ పూర్తి అయింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణలు పూర్తి కావడంతో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల కమిషన్​ ప్రకటించింది. కాగా వివిధ కారణాలతో 17 మంది నామినేషన్లను తిరస్కరించినట్లు వెల్లడించారు. దీనిలో పదిమంది అభ్యర్థులు స్వతంత్రులు కాగా.. ఏడుగురు వివిధ పార్టీలకు చెందినవారు. నామినేషన్లను తిరస్కరించిన జాబితాలో బీజేపీ నేత నివేదితారెడ్డి, కాంగ్రెస్​ నుంచి కాటావత్​ శంకర్​ నాయక్, అమ్​ ఆద్మీ పార్టీ నుంచి మహ్మద్​ కుత్భుద్దీన్​తో పాటు పలువురు ఉన్నారు.

ఇక 60 నామినేషన్ల ఆక్సెప్ట్​ చేసినట్లు ఈసీ ప్రకటించింది. దీంతో సాగర్​ బరిలో మొత్తం 60 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్​ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్​, టీఆర్​ఎస్​ నుంచి భగత్​ కుమార్​, టీడీపీ నుంచి మువ్వా అరుణ్​ కుమార్​, ఎంఐఎం నుంచి నూరజ్​ బేగం, ఎంసీపీఐ నుంచి కాశయ్య, అన్నా వైఎస్​ఆర్​ నుంచి వడ్ల శ్యాంతో పాటుగా 46 మంది స్వతంత్రులు బరిలో నిలిచినట్లు సీఈఓ శశాంక్​ గోయల్​ వెల్లడించారు.

Next Story

Most Viewed