- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ముషీరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. అయితే.. దీక్షలో ఆమె కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రారంభం నుంచి మాస్క్ ధరించకుండా వేదికపై కూర్చున్న షర్మిల సాయంత్రం వరకు అలాగే దీక్షను కొనసాగించారు. షర్మిల దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన వైఎస్ విజయమ్మ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్యలు సైతం మాస్కులు ధరించకుండానే వేదికపై కూర్చోవడం గమనార్హం. తాను చేపట్టిన దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజల సైతం మాస్కు లేకుండానే ఫోన్లు తీసుకొని షర్మిల సెల్ఫీలు దిగారు. ఇదిలా ఉంటే పరిమిత సంఖ్యలోనే దీక్షకు ప్రజలు హాజరు కావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. చాలా మంది మస్కులు ధరించకుండానే దీక్షలో పాల్గొన్నారు. భౌతిక దూరం పాఠించిన ధాఖలాలు ఎక్కడా కనిపించలేదు. దీంతో పలువురు దీనిపై విమర్శలు చేస్తున్నారు.