ఖమ్మం బయలుదేరిన షర్మిల..

by  |
ఖమ్మం బయలుదేరిన షర్మిల..
X

దిశ, తెలంగాణ బ్యూరో : లోటస్‌ పాండ్ నుంచి కార్లతో భారీ ర్యాలీగా వైఎస్ షర్మిల ఖమ్మం సభకు తన తల్లి విజయమ్మతో కలిసి బయల్దేరారు. ఇన్ని రోజులు లోటస్ పాండ్ వేదికగా సమావేశాలు నిర్వహించిన ఆమె శుక్రవారం ఖమ్మం బహిరంగ సభలో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే అంశాలపై ప్రసంగించనున్నారు. ఇంకా ఈ సభలో ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా ఖమ్మం వెళ్తున్న షర్మిలపై పలు చోట్ల అభిమానులు పూల వర్షం కురిపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.


Next Story