శంకర్‌పల్లిలో ఆ ఇండ్లు కూల్చేస్తాం.. మున్సిపల్ చైర్‌పర్సన్ హెచ్చరిక

by  |
శంకర్‌పల్లిలో ఆ ఇండ్లు కూల్చేస్తాం.. మున్సిపల్ చైర్‌పర్సన్ హెచ్చరిక
X

దిశ, చేవెళ్ల: శంకర్‌పల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి స్వామి నాయక్‎పై చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శంకర్‌‌పల్లిలో ఎన్నో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారి అటు వైపు చూసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు కూడా హాజరుకావడం లేదని.. ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. ఇక నుంచి అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినా, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా.. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం ఎలాంటి నోటీసులు లేకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్ సిబ్బంది కూల్చివేస్తారని హెచ్చరించారు.


Next Story

Most Viewed