ఒక్కసారిగా బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 9 |
ఒక్కసారిగా బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: నడుస్తోన్న టీఎస్ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంది. బస్సు ప్రకాశం జిల్లా సూరరెడ్డి పాలెం వద్దకు రాగానే బస్సు ఇంజన్‌లో మంటలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. వెంటనే అలర్ట్ అయ్యి ప్రయాణికులను కిందకు దింపాడు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed