కల్తీకల్లు, గుట్కా విక్రయదారుల పట్టివేత

by  |

దిశ, రంగారెడ్డి: కల్తీ కల్లు, నిషేధిత గుట్కాను అమ్ముతున్న వారిని శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సాతంరాయి, గగన్ పహాడ్‌లో కల్తీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. తొండుపల్లి గ్రామంలో నిషేధిత మిరాజ్ పాన్ మసాలా అమ్ముతున్న చెరుకు పురుషోత్తంను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 15 వేల విలువైన నిషేధిత గుట్కా, పాన్ మసాలాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Tags: Shamshabad rural,police, 5 people Arrested, gutkha, Capture

Next Story

Most Viewed